కెసిఆర్, కెటిఆర్ , కవిత మాస్కులతో ఆర్టీసి నిరసన

హైదరాబాద్  రాణి గంజ్ డిపో వద్ద కెసిఆర్, కె టి ఆర్, కవిత,చిత్రాలతో ఉన్న మాస్కులను ధరించి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. మాస్కులతో బతుకమ్మ ఆడుతూ నినాదాలు చేస్తూ వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ రోజు 47 రోజులోగా సాగుతున్న ఆర్టీసి జెఎసి  సమ్మెను విరమించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పునేపథ్యంలో ప్రభుత్వం, ఆర్టీసి యాజమాన్యం గౌరప్రదంగా, ఎలాంటి షరతులు లేకుండా విధులకు ఆహ్వానిస్తే తాము సమ్మె విరమిస్తామని ప్రకటన జారీ చేశారు. అయితే నిరసన ప్రదర్శనలను ఆపలేదు. రాణిగంజ్ డిపో వద్ద ప్రదర్శన ఇందులో భాగమే.