సోషల్ డిస్టెన్స్ పాటిస్తే పార్లమెంటు చాలదు, వర్షాకాల సమావేశాలు లేనట్లే…

రెగ్యులర్ పార్లమెంటు సమావేశాలు ఈ సారి నిర్వహించడం కష్టమనే సూచనలు పార్లమెంటు అధికారుల నుంచి వెలువడుతున్నాయి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో  పార్లమెంటు సమావేశాలను కరోనా ప్రొటోకోల్ ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది.అంటే పార్లమెంటు సభ్యలను దూరం దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోబెట్టి నిర్వహించాల్సి ఉంటుంది.
ఇలా  చేస్తే లోక్ సభ, రాజ్యసభ్యలు కూర్చునేంత జాగా ఉండదని పార్లమెంటు అధికారులు రాజ్యసభ ఛెయిర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి,  స్పీకర్  ఓం బిర్లాకు తెలియచేసినట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్ లో అవినీతి భూకంపం: 69,000 మంది టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాం

ఇక పార్లమెంటు సమావేశాలు ఎలా నిర్వహించాలో  తుది నిర్ణయం తీసుకుంటారు. రెగ్యులర్ సమావేశాలు సాధ్యం కాకపోతే, డిజిటల్ సమావేశాలే నిర్వహించాల్సి ఉంటుంది.
వివరాలు 
 ఈ సారి ఎలా నిర్వహించాలనే దాని చాలా రోజులుగా మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఛెయిర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ విషయాన్నిఅధికారులతో చర్చించారు.

https://trendingtelugunews.com/english/trending/csirs-anti-cancer-drug-iiim-290-enters-clinical-trial/

సాధారణంగా పార్లమెంటులో లోక్ సభ సభ్యులను రాజ్యసభలోకి, రాజ్యసభ సభ్యులు లోక్ సభలోకి రాకూడదు. అయితే, ఇపుడు ఈ పరిస్థితి తారుమారవుతున్నది. సభ్యుల మధ్య సోషలి డిస్టాన్స్ పాటించాలి కాబట్టి ఇపుడు సభలు చాలవు . అందువల్ల తక్కువ మంది సభ్యులన్న రాజ్యసభను లోక్ సభలోకి మార్చి, లోక్ సభను పార్లమెంటు సెంట్రల్ హాల్ లోకి తీసుకువచ్చి సమావేశాలు నిర్వహిస్తే ఎలా బాగుంటుందనే విషయాన్ని చర్చించారు.
ఇప్పట్లో కరోనా పాండెమిక్ బెడద తొలగే అవకాశం లేదు. అందువల్ల వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కరోనా నీడల్లోనే నడపాలి.అంటే పార్లమెంటు సభ్యులు మూతికి మాస్క్ తగిలించుకుని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సభలలో కూర్చోవాలి.
లోక్ సభ సెంట్రల్ హాలులో 800 మంది కూర్చోవచ్చు. అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లోక్ సభ లో ఉన్న543 మంది సభ్యులను సెంట్రల్ హాల్ లో  దూరం దూరంగా కూర్చోబెట్టవచ్చని అనుకున్నారు.

https://trendingtelugunews.com/uncategorized/government-to-build-super-speciality-at-markapur-praakasam-district/

ఇదే విధంగా రాజ్యసభ లో 245 మంది ఉన్నారు. వీరంతా రెండు మీటర్ల సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లోక్ సభలో కూర్చునేందుకు వీలవుతుందా లేదా అనే విషయాన్ని రెండు సభల సెక్రెటరీ జనరల్స్ పరీశీలించారు.
సెంట్రల్ హాల్ లో పార్లమెంటు సమావేశాలు  సాధారణంగా జరగవు. భారత స్వాంతంత్ర్య స్వర్ణోత్సవ ప్రత్యేక సమావేశం సెంట్రల్ హాల్ లోజరిగింది. తర్వాత ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాల ముందు రాష్ట్ర ప్రతి ప్రసంగం కోసం ఉభయ సభ సంయుక్త సమావేశం పార్లమెంటు సెంట్రల్ హాలులో జరుగుతుంది. అయితే, ఇక్కడ ఎపుడు రెగ్యులర్ పార్లమెంటు సమావేశాలు జరగలేదు. అంటే పార్లమెంటు చర్చలు జరగ లేదు.
పార్లమెంటు వర్షా కాల సమావేశాలు జూలై లో ప్రారంభమయిన ఆగస్టు దాకా నడుస్తుంటాయి. అయితే,వీటికి కచ్చితంగా వర్షకాలంలోనే నడపాలనే నిమమేమీ లేదు. అవసరమనుకుంటే మరోనెలకి వాయిదా వేసుకోవచ్చు.
అయితే, వాయిదా వేసుకున్న కరోనా ప్రొటొకోల్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సభలను మార్పు చేసి నిర్వహిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కోవిడ్ పాండెమిక్ మధ్యలో అర్ధాంతరంగా మార్చి 23 న ముగిశాయి.
పార్లమెంటు సెంట్రల్ హాల్

పార్లమెంటు సెంట్రల్ హాల్ అనేది పార్లమెంటులో ఒక విశిష్టమయిన ప్రదేశం. ఇందులోకి రాజ్యసభ, లోక్ సభ ఎంపిలు, మాజీ ఎంపిలు సీనియర్ జర్నలిస్టులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పార్లమెంటు సముదాయంలో ఉన్న పెద్ద హల్ ఇదే. అందుకే అందరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతకోవడం, చర్చించుకోవడం చేస్తుంటారు. ఎంపిలు, ప్రధానిని కలుసుకునేందుకు ఇదొక చక్కని అవకాశం. సాధారణంగా ప్రధాని కలిసేందుకు అనుమతి అవసరం. ఇక్కడ ఎలాంటి అనుమతి లేదు. ఏదోఒక సభలోనుంచి ప్రధాని వెళ్లిపోతున్నపుడు చటుక్కున పోయి నమస్కారం పెట్టి, వినతి ప్రతం ఇవ్వవచ్చు. అపుడపుడు ప్రధాని కూడ ఇక్కడ కూర్చుంటుంటారు. ఇక్కడ ప్రవేశం వున్న వారందిరికి క్యాంటిన్ సదుపాయం ఉంది.

LIKE THIS STORY? SHARE IT WITH A FRIEND

స్వతంత్ర భారత పార్లమెంటు ఎర్పడక ముందు ఇది రాజ్యంగసభ (Constituent Assembly). ఇక్కడే రాజ్యాంగ తయారయింది. బ్రిటిష్ పాలకుల నుంచి భారతీయుల చేతికి అధికార బదిలీ వేదిక కూడా పార్లమెంటు సెంట్రల్ హాలే.
స్వాతంత్య్ర ప్రకటన వచ్చిన ఆర్థరాత్రి అంటే ఆగస్ట్ 14, 1947 ఆర్ధరాత్రి, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రఖ్యాత “Tryst With Destiny” ప్రసంగం చేసిన విషయం గుర్తుంది కదా. ఆయన ప్రసంగించింది పార్లమెంటు సెంట్రల్ హాల్ నుంచే.
ఈ మధ్య కాలంలో జిఎస్ టి మీద పార్లమెంటు సమావేశం జరిగింది సెంట్రల్ హాల్ లోనే. తర్వాత 1992లో క్విట్ ఇండియా ఉద్యమం 50 వ వార్షికోత్సవం కోసం పార్లమెంటు ఆగస్టు ఆర్ధరాత్రి సమావేశమయిందిక్కడే. గాంధీ క్విట్ ఇండియా పిలుపు ఆగస్టు 8, 1942 బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇచ్చారు.
1997 ఆగస్టు 14-15 అర్ధరాత్రి స్వాతంత్ర్యం 50 వార్షికోత్సవం కోసం పార్లమెంటులో సంయుక్త సమావేశం సెంట్రల్ హాల్ లోనే జరిగింది.
సెంట్రల్ హాల్ గోడల మీద 25 భారత మహానేత చిత్రాలున్నాయి. ఈ జాబితాలకెక్కిన చివరి చిత్రం ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన చిత్రపటాన్ని రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ 2019 ఫిబ్రవరి 12 ఆవిష్కరించారు.