స్కూళ్లలో ప్రార్థన,ఆటలు బంద్: ఏపీలో పాఠశాలలకు కొత్త రూల్స్

ఆగస్టు 3 నుంచి మొదలవుతున్న విద్యాసంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన కోవిడ్ నివారణ చర్యలపై పాఠశాల  ఆంధ్ర ప్రదేశ్  విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
తరగతి గదిలోొ 30మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండరాదు. ఉంటే రెండుగా  విభజించి షిఫ్ట్ పద్ధతిలో విద్యాబోధన చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనాలు మానేసి విద్యార్థులకు సరకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లాక్ డౌన్ అనంతర  కాలానికి తగిన విధంగా పాఠశాలల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాఠశాలలలో  విద్యార్ధులెపుడూ గుమికూడే అవకాశం లేేకుండా కార్యక్రమాలను నియంత్రించాల్సి ఉంది.  గుమికూడే కార్యక్రమాలు అంటే, ప్రేయర్, గేమ్స్ వగైరాల వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో  ప్రభుత్వం సమావేశాలను, గ్రూప్ యాక్టివిటీలను పూర్తిగా రద్దచేస్తున్నది దీనితో పాటు శానిటైజేషన్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
స్కూల్ తెరిచే సమయంలో తప్పనిసరిగా చేయాలి:
– పాఠశాల ఆవరణను పూర్తిగా శానిటైజ్ చెయ్యాలి. క్రిమిసంహారాలతో కరోనా వైరస్‌ రహితంగా శుద్ధి చేయాలి.
-పాఠశాల ఎంట్రన్స్ వద్ద స్టూడెంట్స్ టెంపరేచర్ పరిశీలించే ఏర్పాటు చేయాలి.
– టీచర్స్, స్టూడెంట్స్ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
– 30మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి.
– యూనిఫామ్ తో పాటు కర్చీప్ కూడా తప్పనిసరి
– సబ్బులు, శానిటైజర్లను స్కూలు యాజమాన్యం అందుబాటులో ఉంచాలి
– తాగునీరు, మధ్యాహ్న భోజన విరామానికి 10 మందికి మించి ఉండకూడదు.
– మార్నింగ్ ప్రేయర్ రద్దు. క్లాసులో ఉండి మైకుల ద్వారా చేసుకోడానికి అనుమతి
– 30మంది స్టూడెంట్స్ మించి ఉంటే ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 12.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు విడతల్లో క్లాసులు నిర్వహించాలి.
– 50-100మంది ఉంటే రోజు విడిచి రోజు క్లాసెస్ నిర్వహించాలి
– ప్రతి రోజు పావుగంట కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి
– గేమ్స్ పీరియడ్‌ను రద్దు చేయాలి. వ్యక్తిగత వ్యాయామాలు, యోగా నేర్పించవచ్చు
– ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ తప్పనిసరిగా నిర్వహించాలి. పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు మూవీస్ లాంటివి చూపించాలి.
పరీక్షల నిర్వహణ సమయంలో..
– ఎగ్జామ్ సెంటర్స్ వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి.
– ఒక్కో గదిలో 10మందిని మాత్రమే ఎగ్జామ్ కు అనుమతించాలి.
– కంటోన్మెంట్, కట్టడి ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్ కు కలెక్టర్లు రవాణా సదుపాయం కల్పించాలి.
– కరోనా సింటమ్స్ ఉండే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేయాలి.
– వాల్యువేషన్ సెంటర్లను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి.