సాక్షి పేపర్ లో ఇసుక ఉంది, బజార్లో లేదేమి జగనన్నా: నారా లోకేష్

మీ పేపర్లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు దొరకడం లేదు జగన్ గారు… అని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రం  ప్రయోగించారు.
ఇసుక అక్రమార్కుల పై ఉక్కుపాదం మోపుతాం అంటూ భారీగా ప్రకటనలు ఇస్తున్నారు, మీరు చెప్పిన టోల్ నెంబర్ నిజంగా పనిచేస్తే మీ పార్టీ ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
మీ నూతన ఇసుక పాలసీ వలన 50 మంది కార్మికులు బలైయ్యారు,నిర్మాణ రంగం పడకేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.
ఇసుక రేటుని మీ నాయకులు పెంచుకుంటూ పోతున్నారు
మీ పత్రికలో ప్రకటనలకు కోసం వృధా అవుతున్న ప్రజా ధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తాం.. అని  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ మీద విరుచుకుపడ్డారు.