జగన్ కెసిఆర్ మళ్లీ ఈ నెల 13న భేటీ

 తెలంగాణ  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి మరొక సారి సమావేశం కానున్నారు.
ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న విభజన సమస్యలకు చర్చకు వస్తాయని చెబుతున్నారు.
నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు ఇద్దరు  సీఎంలు సమావేశమయి చర్చించారు.