జనసేన ‘ఛలో వైజాగ్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

భవననిర్మాణ కార్మికుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3న తలపెట్టిన ఛలో వైజాగ్ కార్యక్రమం వాల్ పోస్టర్ విడుదలయింది.
మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహనగాంధీ పోస్టర్ విడుదల చేస్తూ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని  పిలుపునిచ్చారు.
 బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భవననిర్మాణ కార్మికులతో కలిసి వాల్ పోస్టరును ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గాంధీ ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా ఎంతో మంది కార్మికులు గత 5 నెలలుగా పనులు లేక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మీకులకు మద్దతుగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ లో వచ్చేనెల 3వ తేదీన మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నారని,ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.