ఇక కార్మికులను విధుల్లోకి తీసుకోండి : కెసిఆర్ కు పవన్ విజ్ఞప్తి

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు  విజ్ఞప్తి  చేశారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.
వారి విన్నపాన్ని మన్నించి కార్మికుల పై సానుభూతితో ఎటువంటి ఆంక్షలు లేకుండా తీసుకోవాలని సీఎం కేసీఆర్ ని కోరుతున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా నేతల ద్వారా సంఘాల నాయకులు కోరారు
40 రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.
కుటుంబ పెద్దగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను
 
ఉద్యోగులు విధుల్లో చేరిన వెంటనే ప్రజారవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
ఆ తర్వాత వారి సమస్యలను అర్థం చేసుకుని కెసిఆర్ పరిష్కరించాల్సింది గా కేసీఆర్ ను కోరుతున్నా.