పాలెగాళ్ల రాజ్యం తెస్తామంటే ఒప్పుకోం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలెగాళ్ల రాజ్యం తెస్తామంటే చూస్తూ వూరుకోమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయన కాకినాడలో పర్యటించారు.వైసిపి ఎమ్మెల్య ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జరిపినదాడిలో గాయపడిన వారిని పరామర్శించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  జగన్  పాలెగాళ్ల రాజ్య తీసుకురావాలనుకుంటున్నారని విమర్శించారు. జగన్ వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షనిస్టుల రాజ్యం వస్తుందని తానే ఏనాడో హెచ్చరించానని, ఇపుడది కళ్ల ముందుకనబడుతూ ఉందని ఆయన అన్నారు.
వైసిపి నాయకులే ప్రజలను తిడుతున్నారు, కొడుతున్నారు, వాళ్లే కేసులు పెడుతున్నారు. పోలీసులు కూడా వారికేగొడగులు పడుతున్నారు… అని ఆయన విమర్శించారు.జిల్లా ఎస్ పి ప్రజలమీద దాడలు జరిపిన వార మీద కేసులు పెట్టాలని కోరారు. కాకినాడ దాడులవిషయాన్ని గవర్నర్ దృష్టి కి తీసుకువెళ్లతామని అన్నారు.