టిడిపి ప్రభుత్వంనిలువునా ముంచింది, అందుకే సమీక్షలు : మంత్రి బుగ్గన

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) ఇప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంసమీక్షిస్తూ ఉంది.  దీని మీద కొన్నివిమర్శలుకూడా వచ్చాయి. కేంద్రం కూడాఈ సమీక్షలను తప్పు పట్టింది. ఈ నేపథ్యంలోతా ము ఎందుకు పాత వప్పందాలన సమీక్షించాల్సి వచ్చిందో  ప్రతి పక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌గారు సమాధానం ఇచ్చారు. బుగ్గన జవాబు ఇది –
– పవన, సౌర విద్యుత్‌ పర్యావరణ పరిరరక్షణ దష్ట్యా మంచివే. కానీ అవి ఇప్పుడు ఎంతో వ్యయంతో కూడుకున్నాయి
– మిగతా దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఏ ఏడాది ఏ రంగం నుంచి ఎంత విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి అన్నదానిపై స్పష్టత ఉంది
– కానీ గత ప్రభుత్వం నిర్ణీత శాతానికి మించి 41 శాతం అధికోత్పత్తికి హడావిడిగా ఒప్పందం చేసుకున్నారు. 2017, మార్చికి కాలపరిమితి అయిందని చెప్పి కేవలం 15 రోజుల్లో 41 పీపీఏలు చేసుకున్నారు.
– కేవలం 15 రోజుల్లో పవన విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు, ఉత్పత్తి సాధ్యమా? నిజానికి అందుకు కనీసం ఏడాదిన్నర పడుతుంది
– రెన్యువబుట్‌ ఎనర్జీ ఒక్కో యూనిట్‌ దాదాపు రూ.4.84 పడుతుంది. అదే సమయంలో థర్మల్‌ విద్యుత్‌ దాదాపు రూ.3 పడుతుంది. అంటే దాదాపు రెండు రూపాయలు తేడా
– ఈ నేపథ్యంలో రెన్యువబుల్‌ పవర్‌ (సౌర, పవన విద్యుత్‌)ను తీసుకోలేమని డిస్కమ్‌లు స్పష్టం చేశాయి
– ఇక «థర్మల్‌ విద్యుత్‌ వినియోగానికి సంబంధించి ఒక ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ ఉంటుంది. అంటే విద్యుత్‌ వాడుకోకపోయిఆన ఒక్కో యూనిట్‌కు రూ.1.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది
– అందువల్ల సౌర, పవన విద్యుత్‌ వినియోగానికి వెళ్తే, అక్కడ ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.2 ఎక్కువ చెల్లించాల్సి రావడం, మరోవైపు థర్మల్‌ విద్యుత్‌ వినియోగించుకోనందుకు ఫిక్స్‌డ్‌ ఛార్జీ కింద ఒక్కో యూనిట్‌కు రూ.1.50పైన చెల్లించాల్సి ఉంటుంది.
– అంటే దీని వల్ల ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ను దాదాపు రెట్టింపు ధరకు కొనుగోలు చేసినట్లు అవుతుంది.
– వీటన్నింటి నేపథ్యంలోనే పీపీఏల సమీక్షకు ప్రభుత్వం సిద్ధమైంది
– నిజానికి గత ప్రభుత్వం డిస్కమ్‌లకు కూడా పెద్ద ఎత్తున బకాయి పడింది.
– అదే విధంగా 2014–15లో డిస్కమ్‌ల నష్టాలు రూ.9 వేల కోట్లు కాగా, 2018–19 నాటికి అవి ఏకంగా రూ.29 వేల కోట్లకు చేరాయి
– అంటే 5 ఏళ్లలో డిస్కమ్‌ల నష్టాలు రూ.20 వేల కోట్ల నష్టాలు పెంచారు
– కేంద్రం రాసిన లేఖలో స్పష్టంగా ఉంది. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే చర్య తీసుకోవాలని కేంద్రం పేర్కొంది
– మరోవైపు టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు కూడా పెద్ద ఎత్తున బకాయి పడింది
– విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం 2014–15లో రూ.3910 కోట్లు బకాయి పడగా, ఆ మొత్తం 2018–19 నాటికి ఏకంగా రూ.21,540 కోట్లకు పెరిగాయి
– వాటన్నింటినీ చెల్లిస్తూ వస్తున్నాం. అందుకే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష చేపడుతున్నాం.