వయోవృద్ధులు తిరుమలలో ఉచిత దర్శనం ఇలా చేసుకోవచ్చు

తిరుమల లో వయోవృద్ధులు  శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం ఇలా చేసుకోవచ్చు.

వయో వృద్ధులంటే 60 సంవత్సాల వయసు లేదా ఆపైన. వారికి శ్రీవారి దర్శనానికి రెండు సమయాలున్నాయి:

ఉదయం 10 గంటలకు. ఒకసారి,  తరువాత  సాయంత్రం 3 గంటలకు.

దర్శనానికి ఈ కోటా కింద వచ్చే వారు ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రాలు “S-1 counter” వద్ద చూపించాల్సి వుంటుంది.

ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద  గోడ పక్కనే ఈ కౌంటర్ ఉంటుంది.

పెద్దవాళ్లెవరూ  మెట్లు ఎక్కాల్సిన పని లేదు. అక్కడ వారికి అన్ని వసతులున్నాయి.  మంచి సీట్లు ఏర్పాటు చేశారు.   వారికి సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు ఉచితంగా…

వారికి  రు .20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత  25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.

కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణ వసతి ఉంటుంది.

వీరి దర్శనం కొరకు మిగతా అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి.ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు. 30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది.