శ్రీవారి బూందీ పోటులో అగ్నిప్రమాదం

తిరుపతి : తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం బూందీ తయారు చేస్తున్నప్పుడు ఒక పొయ్యిమీద పాత్రలో నెయ్యి వొంపుతున్నపుడు  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది పరుగులు పెట్టారు. సెక్యూరిటీ అధికారులు ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

అగ్ని ప్రమాదం సంభవించడంతో లడ్డుల తయారీ నిలిచిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.