అనంతపురం కోవిడ్-19 రిపోర్ట్ ఇది

అనంతపురం: ఇప్పటివరకు జిల్లాలోని హిందుపురంకు చెందిన ఐదుగురికి, లేపాక్షి కి చెందిన ఒకరికి కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
# హిందూపురం పట్టణంలోని దన్కే స్ట్రీట్ కు చెందిన ఒకరి, హస్నాబాద్ కు చెందిన ఒకరికి, హౌసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన ఇద్దరికీ, ముక్కిడి పేట కు చెందిన ఒకరికి, లేపాక్షికి చెందిన ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది.
# మార్చి 29న ఇద్దరికీ, ఏప్రిల్ 4వ తేదీన ఒకరికి, ఏప్రిల్ 5 వ తేదీన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది.
# ఇప్పటివరకు నమోదైన 6 కేసుల్లో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, మరణానంతరం అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.
# మిగిలిన ఐదుగురు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.