ఆంధ్రలో 40 శాతం బార్ల తగ్గింపు, రేట్ల పెంపు: ఒకె చేసిన జగన్

 అమరావతి:  రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ రోజు బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వై ఎస్.జగన్‌ మోహన్ రెడ్డి సమీక్షించారు. అదే సమయంలో  బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచేేందుకు  ప్రభుత్వంయోచిస్తూ ఉంది. ఇవన్నీ మద్య నిషేధం అమలులో భాగంగా తీసుకుంటున్న చర్యలు.
స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించనున్న ప్రభుత్వం నిర్ణయించింది.
బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలన్న సీఎం సూచించారు.అయితే,  ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిద్దామన్న అధికారుల సూచనను ముఖ్యమంత్రి అంగీకరించారు.
 తగ్గింపు పర్యవసానాలమీద బాగాచర్చించినతర్వాత  బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని,  బార్లలో మద్యం సరఫరా వేళల కుదింపుచేయాలని సమావేశం నిర్ణయించింది.
బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, రాత్రి 11 వరకూ ఆహారం అందుబాటులో ఉంటుంది. స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం విక్రయిస్తారు.
సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు:
మద్యం కల్తీకి పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలుంటాయి. నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు
లైసెన్స్‌ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయం
మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం  తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.