అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె

కొన్ని ప్రభుత్వం రంగ జాతీయ బ్యాంక్ ల విలీనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక రోజుజాతీయ సమ్మెలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు నిర్ణయించాయి. సమ్మె అక్టోబర్ 22న జరుగుతున్న సంగతి తెలిసిందే.

​ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం హిమాయత్ నగర్ లోని కామ్రేడ్ సత్యనారాయణ భవన్ లో జరిగింది. ​​సమావేశంలో​ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,​ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు పాల్గొన్నాయి.

ప్రధాన కార్యదర్శి తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ​రాంబాబు మాట్లాడుతూ
ఇటీవల ​ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నాలుగు బ్యాంక్ లు గా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూన్నామని పేర్కొన్నారు.

అందులో భాగంగానే ​అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు ​బ్యాంక్ ల​ సమ్మె

​​పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల విలీనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్రగతి నిరోధకచర్య అని  ​10 బ్యాంకులు 4 బ్యాంకులు గా విలీనమై పోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుందని ఆయన అన్నారు.

ఆయన ఇంకే మన్నారంటే…

​ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలినాలతో బ్యాంకుల ప్రేవేటీ కరణకు దారితీస్తుంది.

కేంద్ర ప్రభుత్వ చర్య తో ​గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కులుతుంది.

​బ్యాంకుల విలీనం తో ఉద్యోగులు తగ్గిపోతారు దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుంది.

కేంద్రప్రభుత్వం ​బ్యాంక్ ల సంస్కరణల పేరుతో కార్పొరేట్ సంస్థలకు దగ్గర అవుతుంది.