1930 కి చేరిన ఆంధ్ర కరోనా కేసులు, మృతుల సంఖ్య 44

గత 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లో 43 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా అంటే 16 కేసులు కృష్ణా నుంచి, 11 కేసులు చిత్తూరు నుంచి వచ్చాయి.  ఈ రోజు కేసులతో రాష్ట్రం  మొత్తం కేసులు 1930 కి చేరాయి. ఇందులో 887 మంది ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ కాాగా మరొక 999 మంది చికిత్సపొందుతున్నారు.  మొత్తంగా రాష్ట్రంలో కోవిడ్ 19 వల్ల ఇంతవరకు మృతి చెందినవారి సంఖ్య 44. శుక్రవారం నాడు మొత్తం 8388 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 43  మంది పాజిటివ్ గా కనిపించారని వైద్య ఆరోగ్య శాఖ ఒక బులెటీన్ లో పేర్కొంది. వివరాలివే…