జెసి పిఎ ఇంటి మీద ఎసిబి దాడి

అనంతపురం: టీడీపీ అనంతపురం  మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి జరిగింది. అతని ఇంటిలో దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తులను అధికారులు గుర్తించారు. సురేషర్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తుంటూ డిప్యూటేషన్ మీద  జెసి దగ్గిర పిఎగా చేరారు. చాలాకాలంగా జేసీ దివాకర్ రెడ్డి పీఏగా పనిచేస్తూ వచ్చారు.  అయితే జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా, లేకపోయినా సేవలు అందిస్తుంటారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏఈఈ సురేష్ రెడ్డి పై ఆరోపణల వచ్చిన  నేపథ్యంలో ఎసిబి ఆయన నివాసాన్ని సోదా చేసింది.ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. జేసీ దివాకర్ రెడ్డి పేరుని అడ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టాడని ఆయనమీద ఫిర్యాదులొచ్చాయని తెలిసింది.అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ల పై దాడులు జరిగినట్లు సమాచారం.