కారుణ్య మరణం కోసం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్న గ్రూప్-2 బాధితులు

తెలంగాణ గ్రూపు 2 అభ్యర్ధులు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు ప్రకటించకపోవడంతో తాము చనిపోయేందుకు అనుమతివ్వాలని వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించనున్నారు. గత రెండేళ్లుగా తాము ఫలితాల కోసం ఎదురు చూసి మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని ఏ పని చేయలేక బతకలేక చచ్చిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టిఎస్ పిఎస్సీ నిర్లక్ష్య వైఖరితో తమ జీవితాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

తమ మరణానికి అనుమతివ్వాలని కోరుతూ వారు హక్కుల సంఘాన్ని  శుక్రవారం ఆశ్రయించనున్నారు.

మీడియా సోదరులకు విజ్ఞప్తి,

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులమైన మేము ఈ రోజు ( 22/03/2019) కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నాం. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ ప్రభుత్వ అలసత్వం మూలంగా గ్రూప్ -2 మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఫలితాలు వెలువడని పరిస్థితి. పరీక్ష నిర్వహణలో మొదటి నుంచి టీఎస్‌పీఎస్సీ చేస్తోన్న తప్పిదాల వల్ల మెరిట్ లిస్టులో ఉన్న మేం బాధితులుగా మారాం.

రెండున్నరేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ మా విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి విన్నవించినా, టీఎస్సీపీఎస్సీ అధికారులను కలిసినా వారిలో కనీస స్పందన కూడా లేదు. ప్రభుత్వంలో కదలిక తేవాలని ఎన్నో సార్లు ఆందోళనలు, ధర్నాలు చేసినప్పటికీ వాళ్ల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. అలాగే, ఈ ఉద్యోగం రాక, వేరే ఉద్యోగం చేయలేక ఇంటా బయట ఎన్నో అవమానాలు ఎదర్కొంటున్నాం. తీవ్ర మానసిక వ్యథ అనుభవిస్తున్నాం.

చివరకు ఏ దారి లేక 200 మంది అభ్యర్థులం ఇప్పుడు కారుణ్య మరణం కోసం మానవహక్కుల కమిషన్‌ను కలుస్తున్నాం. మా వేదనను మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాం.

ఇట్లు

తెలంగాణ గ్రూప్-2 బాధితులు

Contact Numbers:

Geetha–8328018263

Sujatha–8886441168

Shravya-9440880098

Rajitha-7997116497

Imran-9676885709

Sanath-9908940271

Gopal-9989490013

Pramodh-9490288882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *