కేటిఆర్ ఇజ్జత్ తీసిన సిరిసిల్ల ఛైర్ పర్సన్ (వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల పరువును సొంత పార్టీ వారే తీసి పారేస్తున్నారు. తెలంగాణ సిఎం తనయుడు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఇజ్జత్ ఖరాబ్ చేశారు ఆ పార్టీకి చెందిన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్. సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఛైర్ పర్సన్ సామల పావని మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్లకు రావాల్సిన పర్సెంటేజీలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు వేధించడం సరికాదని ఆమె హెచ్చరించారు. మంత్రి (కేటిఆర్) గారే చెప్పారు కదా? అని ప్రశ్నించారు.

ఈ తతంగం సిరిసిల్లలోనే కాదు రాష్ట్రమంతా జరుగుతున్నదే కదా? అని ప్రశ్నించారు. తనకు సంబంధించిన కాంట్రాక్టు లావాదేవీలన్నీ తన భర్త చూసుకుంటారని చెప్పారు. కౌన్సిలర్లు కూడా ఎంతో ఖర్చు పెట్టుకుని గెలిచారు కదా? వారికి రావాల్సిన కమిషన్లు వారికి సక్రమంగా కాంట్రాక్టర్లు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏమన్నారో వీడియోలోనే చూడండి.

పావని రాజీనామా

కేటిఆర్ గురించి సంచలన ఆరోపణలు చేసిన పావని కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. కేటిఆర్ పై తాను చేసిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీానమా లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. రాజీనామా లేఖ ఉంది చూడండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *