ఎర్రచందనం స్మగ్లింగ్ వివాదంలో శకలక శంకర్

శకలక శంకర్ అనే యువ టాలీవుడ్ యాక్టర్ ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్ వివాదంలో చిక్కుకుపోయారు. టివి సీరియళ్లలో కామెడియన్ గా నవ్వులు పూయించిన శకలక శంకర్ తాజాగా హీరోగా ఒక సినిమాలో నటించారు. శకలక శంకర్ నటించిన సినిమాకు ఎర్రచందనం స్మగ్లర్ ఫైనాన్స్ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పూర్తి వివరాలు చదవండి.

ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని పక్కా ఆధారాలతో తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అతనిపై 20 కేసులు నమోదై ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును టాలీవుడ్ లో ఫైనాన్స్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. ఈ స్మగ్లర్ సినిమాల్లో కూడా నటించారని పోలీసులు అంటున్నారు.

ఇటీవల శకలక శంకర్ హీరోగా నటించిన శంభో శంకర సినిమా ఒకటి రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాకు ఫైనాన్స్ చేసింది ఈ ఎర్రచందనం స్మగ్లరే అని పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. టివి సీరియళ్లలో ఈ వ్యక్తి ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. శేషాచలం కొండళ్లో ఎర్రచందనం దుంగలు సేకరించి తెలంగాణ, కర్ణాటక స్మగ్లర్లకు విక్రయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్మగ్లర్ కోట్లకు పడగలెత్తినట్లు చెబుతున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సింది. టాలీవుడ్ కు రియల్ మాఫియాలతోపాటు ఎర్రచందనం మాఫియా సంబంధాలు కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *