కేసిఆర్ పై కొడంగల్ లో మళ్లీ రెచ్చిపోయిన రేవంత్ (వీడియో)

రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. కొడంగల్ గడ్డ నుంచి తెలంగాణ సిఎం కేసిఆర్ మీద విమర్శల వర్షం కురిపించారు. కేసిఆర్ ను పెద్ద దొర అని అలాగే కొడంగల్ లో సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్ రెడ్డిని చిన్న దొర అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తాండూరు ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ ను మరోసారి బుడ్డర్ ఖాన్ అంటూ తిట్ల దండకం అందుకున్నారు.

కొడంగల్ లో రేవంత్ రెడ్డి శుక్రవారం భారీ ర్యాలీ జరిపారు. వేలాది మందితో కొడంగల్ గ్రామాల్లో బైక్ ర్యాలీ జరిపి కాంగ్రెస్ జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. పోలేపల్లి గ్రామం నుంచి కోస్గి వరకు 7 కిలోమీటర్ల మేరకు బైక్ ర్యాలీ చేపట్టారు.

అనంతరం జరిగిన సభలో సిఎం కేసిఆర్, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక నేత గుర్నాథ్ రెడ్డిపై ఎలాంటి పదునైన విమర్శలు చేశారో కింద వీడియో ఉంది మీరే చూడండి.

 

సభకు ముందు కొడంగల్ లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఆ వార్త కింద ఉంది చూడండి.

https://trendingtelugunews.com/revanth-bike-rally-in-kodangal/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *