కొడంగల్ లో దుమ్మురేపిన రేవంత్ బ్రదర్స్ బైక్ ర్యాలీ (వీడియో)

చాలారోజుల తర్వాత కొడంగల్ లో రేవంత్ రెడ్డి హల్ చల్ చేశారు. బైక్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కోస్గిలో జెండా కార్యక్రమం చేపట్టారు. పోలేపల్లి నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై కోస్గి వరకు సాగింది. సుమారు 7 కిలోమీటర్ల మేరకు బైక్ ర్యాలీలో హల్ చల్ చేశారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపిటిసిలు, టిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ముందుగా పోలేపల్లిలోని ఎల్లమ్మ గుడిలో పూజలు చేసి అక్కడి నుంచి రేవంత్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. పోలేపల్లి, హకీంపేట్, సర్జకన్ పేట్ మీదుగా ర్యాలీ కోస్గి చేరింది. బైక్ ర్యాలీ ఎలా సాగిందో కింద వీడియో ఉంది చూడండి.

 

కోస్గిలో జరిగిన సభలో తెలంగాణ సిఎం కేసిఆర్ మీద రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పనిలో పనిగా మంత్రి పట్నం మహేందర్ ను విమర్శించారు. కొడంగల్ లో రేవంత్ ఏం మాట్లాడారో కింది వార్తలో చదవండి.. వీడియో చూడండి.

https://trendingtelugunews.com/revanth-reddy-fire-on-kcr-in-kodangal-tour/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *