చంద్రబాబుపై వైసీపీ సలహాదారు పీకే సెన్సేషనల్ ట్వీట్

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులూ ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు విసురుతున్నారు.

ఇక అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పీకే ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో కింద చదవండి.

“ఓటమెరుగని రాజకీయనాయకులు కూడా సునాయాసంగా ఓడిపోయిన సందర్భాలున్నాయి. మీ నిరాధారమైన ప్రగల్భాలు చూసి నేను ఆశ్చర్యపోవట్లేదు. మీరు చేసే వ్యాఖ్యల్లో బీహార్ పైన ద్వేషం, అసూయ కనిపిస్తున్నాయి. వీటి మీద ఫోకస్ తగ్గించి, మళ్ళి ఏపీ ప్రజలు మీకు ఎందుకు వోట్ వేయాలో అనేదానిపైన గురిపెట్టండి”. అని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పీకే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *