తెలంగాణ పల్లెల్లో విత్తనాలు వేస్తున్నారు. చెల్కలన్నీ రైతులు, కూలీలతో సందడిగా మారిపోయాయి. వేసిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి. మనుషులకే కాదు.. మాకూ జీవించాలంటే పోరాటం చేయాల్సిందే అన్నట్లుగా ఉంది ఈ ఫొటో.
భూమిని చీల్చుకుంటూ కసితో మొలకెత్తుతున్న విత్తనం మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పుతున్నది.
నల్లగొండ జిల్లా, కేతేపల్లి మండలం, కొండకిందిగూడెంలో ఒక రైతు చెల్కలో పి కె నాయుడు తీసిన ఫొటో ఇది.