13న రైతాంగ సమస్యలపై పవన్ కీలక ప్రకటన

జనవరి 13వ తేదీన  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలికి వస్తున్నారు. అక్కడి  పెదరావూరులోని నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగే  భోగి పండుగ వేడుకల్లో పవన్ కల్యాణ్  పాల్గొంటారు.  పవన్ పర్యటన వివరాలను  మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రోజు పవన్ కు స్వాగతం పలికేందుకు పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున  ఏర్పాట్లు సాగుతున్నాయి. వాటిని మనోహర్ పరిశీలించారు.

ఆ రోజు రైతాంగ సమస్యలపై పవన్ ఒక  కీలక ప్రకటన చేస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.  13వ తేదీ రోజంతా రైతులు, మహిళలు, యువతతో పవన్ భేటీ అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *