తెలుగు నాట రజినీకాంత్ ’పేట’కు ధియోటర్లు దొరకడం లేదు…

దేశంలోనే టాప్ స్టార్  రజినీ కాంత్ , ఎలెక్రానిక్ మీడియా రంగంలోనే దిగ్గజం  సన్ టీవీ.  ఇలాంటి సన్ టివి అధినేత  కళానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నిర్మించిన పేట సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదట.

రజనీకాంత్ , సిమ్రాన్ ,త్రిష ,విజయ్ సేతుపతి తో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన “పేట ” సినిమా కు థియేటర్లు లభించడం లేదన్న వార్త తెలుగు సినిమా రంగంలో కలవరం పుట్టిస్తుంది .

“పేట ” సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్ స్వయంగా ఈ విషయం చెప్పాడు.

తమ సినిమాకు థియేటర్లు లేకుండా దిల్ రాజు, అల్లు అరవింద్ , సురేష్ బాబు లాంటివారు అడ్డుపడుతున్నారని ఆరోపించాడు.

సురేష్ బాబు కుమారుడు రానా నటించిన “ఎన్టీఆర్ బయోపిక్ ” తమ్ముడు వెంకటేష్ నటించిన “ఎఫ్ 2” చిత్రాలు విడుదలవుతున్నాయి . కాబట్టి ఎక్కువ థియేటర్లు వీటికి కేటాయించాలనే సురేష్ బాబు ప్రయత్నిస్తుంటాడు.

ఇక అల్లు అరవిందు విషయానికి వస్తే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ ” నాగబాబు కుమారుడు నటించిన “ఎఫ్ 2” సినిమాలు సంక్రాంతికే విడుదలవుతున్నాయి . వీరి సినిమాలకు ఎక్కువ థియేటర్లు వుండాలని అరవింద్ అనుకోవడం సహజం.

అల్లు అరవింద్ , సురేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు దిల్ రాజు . కాబట్టి వీరందరూ “ఎన్టీఆర్ బయోపిక్” , “వినయ విధేయ రామ “, “ఇఫ్ 2” సినిమాల తరువాతనే ఏ సినిమా అయినా అది రజనీది కావచ్చు మరెవదైనా కావచ్చు . తెలుగు సినిమాలో వీరి మోనోపలి ని ప్రశ్నించేవారే లేకుండా పోయారు . నిర్మాతల మండలి , చలన చిత్ర వాణిజ్య మండలి , మూవీ ఆర్టిస్టు అసోసియేన్ అన్నీ వీరి కనుసన్నల్లోనే ఉంటాయి . ఇక ప్రభుత్వాలు చెప్పుకున్నా , అక్కడా వీరి మొర ఆలకించరు . రజనీకాంత్ చిత్రం పోటీగా వచ్చిందని కోపంతో ఇలా చేశారా ? ఇది ఆరోగ్యకరమైన వ్యాపారమేనా ?
రజనీకాత్ పరిస్థితి ఇలావుంటే …. చిన్నా చితక నిర్మాత పరిస్థితి ఊహించనేలేము. !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *