బ్రేకింగ్ న్యూస్: బెజవాడ సెల్ఫీ సూసైడ్ కేసులో న్యూ ట్విస్టు

భార్య, అత్తమామలు వేధిస్తున్నారంటూ విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న గురువారెడ్డి కేసులో కొత్త ట్వీస్ట్ బయటపడింది.  గురువారెడ్డి భార్య గాయత్రికి కార్తీక్ అనే యువకుడితో ప్రేమాయణం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కార్తీక్‌తో సెల్‌ఫోన్‌ సంభాషణలు,మెసేజ్‌లపై గాయత్రిని గురువారెడ్డి నిలదీయడమే భార్యాభర్తల మధ్య వివాదానికి కారణంగా తెలిసింది. గాయత్రి ప్రేమాయణంపై ఆమె తల్లిదండ్రులతో గురువారెడ్డి పంచాయతీ నిర్వహించాడని అయితే కూతురికి మంచి చెప్పాల్సిన తల్లిదండ్రులు ఆ పని చేయకుండా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అల్లుడిని బెదిరించినట్లు విచారణలో తేలింది. అత్తమామల ఆత్మహత్యాయత్నం కేసులో గురువారెడ్డిని పోలీసులు విచారించారు. అయితే చేయని నేరానికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని, తనను అన్యాయంగా కొట్టారని గురువారెడ్డి తాను చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావుకు భార్య, అత్త, మామలే కారణమంటూ ఆ సెల్ఫీ వీడియోలో చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *