పార్లమెంటుకు చంద్రబాబు వందనం

ఈ రోజు ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటుకు వచ్చారు. అక్కడ తెలుగుదేశం ఎంపిలు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.లోనికి వెళ్తూ ఎపుడూ లేని విధంగా పార్లమెంటు మెట్లకు వందనం చేశారు. గతంలో చాలా సార్లు ఆయన పార్లమెంటుకు వచ్చారు. ఎపుడూ ఇలా చేయలేదు. ఇపుడు విభజన  చట్టం అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తూ, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన పార్లమెంటుకు నమస్కరించారు. మామూలుగా ప్రధాని మోదీ ఇలాంటి పనులు చేస్తుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *