నేతలకు ధైర్యం చెప్పే యాత్రలో చంద్రబాబు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో

కార్యకర్తల్లో, నాయకుల్లో, పార్టీకి విధేయులుగా ఉన్న కుటుంబాలలో ధైర్యం నూరిపోసేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
తెలుగుదేశం వూహించనంత తీవ్రంగా ఎన్నికల్లో పరాజయం పాలుకావడం, పార్టీలో ప్రముఖ పాత్ర పోషించిన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిపోవడం,  చాలాచోట్ల పార్టీ నేతల మీద వైసిపినేతలు దాడులు చేస్తూ ఉండటంతో ఆయన వారిని పరామర్శించి గుండెధైర్యం ఇవ్వాలనుకుంటున్నారు.
దీని  కోసమే ఆయన  ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రామాంబపురంలో ఇటీవల వైసీపీ దాడికి గురయిన కుటుంబాని పరామర్శిస్తున్నారు. ఈ దాడి జరిగిన అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డ బసంగారి పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, పరిస్థితులను తెలుసుకుంటారు.
తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని  కూడా  ఆయన పద్మకుటుంబానికి అందచేస్తారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా  టీడీపీ భారీగగాఏర్పాట్లు చేస్తున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాగే ఆయన అన్ని జిల్లాలలో పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.