క్షమించండి బాబు, ఇక మళ్లీ సర్వే చేయను…

ఇక మళ్లీ ఎన్నికల మీద సర్వేలు చేయనని కాంగ్రెస్ మాజీ ఎంపి లగడపాటి ప్రకటించారు. ఆయన సర్వే ఫలితాలు ఫెయిలయిన నవ్వుల పాలు కావడంతో ఆయన ఈరోజు జనం ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి ఇక ముందు సర్వేలు చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టనని ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఆయన మళ్లీ సర్వేలతో జనంముందుకు వచ్చారు. అయితే అపుడు ఫెయిలయ్యారు. ఆయన సర్వే ఫలితాలు ఏ మాత్రం ఎన్నికల ఫలితాలకు దగ్గరగా లేకపోవడంతో ఆయన నవ్వుల పాలయ్యారు. సోషల్ మీడియాలో ఆయన మీద జోకులు తెగు పేల్తున్నాయ్. దీనితో ఆయన జనం ముందుకు రావలసి వచ్చింది. ఎన్నికల్లో ప్రజల నాడి తీసుకోలేకపోయినందుకు చింతిస్తున్నాను. నా ఫలితాల వల్ల ఎవరైనా ఇబ్బందీ పడితే మన్నించాలి.పక్షపాతం లేకుండా గతంలో సర్వేలు చేసి సమాచారం ఇచ్చాను.ఇకపై సర్వేలు చెయ్యనంటూ లేఖ విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *