రేపు సెక్రెటేరియట్ లో అడుగుపెట్టనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక జగన్మోహన్ రెడ్డి రేపు మొట్టమొదటిసారి సెక్రటేరియట్లో అడుగుపెట్టనున్నారు.

రేపు ఉదయం 8.39 గంటలకు సీఎం ఛాంబర్లో జగన్ ప్రవేశిస్తారు. ఇప్పటికే సీఎం ఛాంబర్ మొదటి బ్లాక్ ను అధికారులు వాస్తుకు అనుగుణంగా మార్పులు కూడా చేశారు.  ఈ  రోజు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం సీఎం ఛాంబర్ ను పరిశీలించారు.

ముందుగా జగన్ సెక్రటేరియట్లో ఉదయం ఉదయం 8.39 గంటలకు అడుగుపెట్టనున్న జగన్ 8.42 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం 850 కు ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేసి 9.15 కు మంత్రివర్గం ఏర్పాటు కార్యక్రమం అనంతరం 11.49 కి మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వెళ్లనున్నారు