వైసిఎల్ పి నేతగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పార్టీ కొత్తగా ఎన్నికయిన శాసన సభ్యలతో తాడే పల్లి పార్టీ కార్యాలయంలో ఈ రోజు శాసన సభా పక్ష సమావేశం నిర్ణయించింది.

సమావేశంలో ఈ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఈ మేరకు ఏక వాక్య తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. పార్టీ సీనియర్ నాయకుడు బోత్సా సత్యానారాయణ జగన్ పేరు ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద రావు, కొలుసు పార్థ సారధి, ఆదిమూలం సురేష్, రాజన్న దొర, బుగ్గున రాజేంద్ర ప్రసాద్, ముస్తాఫా, ఆళ్ల నాని, కోన రఘుపతి, రోజా,విశ్వరూప్, నారాయణస్వామి తదితరులు బలపరిచారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/jagan-yclp-meeting-gallery/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *