భార్య వేధింపులు..బెజవాడలో సెల్ఫీ సూసైడ్ (వీడియో)

విజయవాడలో విషాదం జరిగింది. నగరంలోని కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి సెల్ఫీ సూసైడ్ చేసుకున్నాడు. తనను భార్య, అత్తమామ, బావమరిది వేధింపులకు గురి చేస్తున్నారని వీడియోలో చెప్పాడు. చేయని తప్పుకు తన పై తప్పుడు కేసు పెట్టారని, కృష్టలంక పోలీసు స్టేషన్‌లో రెండు రోజులు ఉంచి కొట్టించారని ఆ మానసిక వేదనతోనే తాను చనిపోతున్నట్టు చెప్పాడు. తల్లిదండ్రులు తనను క్షమించాలని కోరుతూ గురువారెడ్డి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారెడ్డి సెల్పీ సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *