ఆధార్ లేదా పాన్ కార్డు, ఏదో ఒకటి చాలు : బడ్జెట్ 2019, ముఖ్యాంశాలు

పన్ను కట్టే వారందరికి ధన్యవాదాలు. వాళ్లవల్లే దేశాభివృద్ధి సాధ్యమవుతూ ఉంది.
రు. 5 లక్షల దాకా ఇన్ కం టాక్స్ లేదు.
బంగారు మీద, అభరణాల మీద కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 12.5 శాతం పెంపు
పెట్రోల్ , డిజెల్ మీద అదనపు ఎక్సయిజ్ సుంకం 1 రుపాయ పెంపు
మార్చి 2020 దాకా తీసుకునే ఇంటి రుణాల మీద విధించే వడ్డీలో రు. 1.50 రిబేటు ఉంటుంది.
ఆధార్ తప్పని సరికాదు. పాన్ కార్డు ఉంటే పరిపోతుంది. రెండింటిలో ఒకటి చాలు
స్టార్టప్ ల కోసం… స్టార్టప్ లు సేకరించే నిధుల మీద ఇన్ కంటాక్స్ వెరిఫికేషన్ ఉండదు. వారొక నివేదిక ఇస్తే చాలు.
విద్యుత్ విహానాలకొనుగోలు రుణాల వడ్డీమీద రాయితీ వుంటుంది
గ్లోబల్ కంపెనీలను భారీగా ఆహ్వానించేందుకు ప్రభుత్వం లిధియం బాటరీలు సోలార్ సెల్స్, సెమీకండక్టర్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ లింక్ డు టాక్స్ బెనిఫిట్ ప్రతిపాదించారు.
కొత్తనాణేలు వస్తున్నాయి. వీటిని ప్రధాని విడుదల చేశారు. ఇవి తొందర్లోనే జనం మధ్య కు వస్తాయి. ఇందులో 20 రుపాయలనాణెం కూడా ఉంటుంది.ఇవన్నీ సులభంగా గుర్తించేందుకువీలుగా వుంటాయి.
రు.400 కోట్ల టర్నోవర్  ఉన్న కంపెనీలన్నింటికి 25 శాతం కార్పొరేట్ టాక్స్ స్లాబ్ వర్తిస్తుంది. దీనితో 99.03 శాతం కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది.
కష్టాల్లో ఉన్న బ్యాంకులకు 70 వేల కోట్ల రుపాయలు అందిస్తారు.

ఇండియన్ పాస్ పోర్టు ఉన్న NRI లకు దేశంలోకి రాగానే ఎదురుచూడకుండా ఆధార్ కార్డు అందిస్తారు.

మహిళలకోసం ఎస్ హెచ్ జి ప్రోగ్రాం దేశంలోకి అన్ని జిల్లాలకు విస్తరింపు. బ్యాంకు అకౌంటు ఉన్న ఎస్ హెచ్ జి మహిళకు రు. 5వేల వోవర్ డ్రాఫ్ట్ వసతి తో పాటు, రు 1లక్ష రుణ వసతి..
ఉజాలా స్కీం కింద ఎన్డీయే ప్రభుత్వం 35 కోట్ల ఎల్ ఇ డి బల్బులను పంచడం జరిగింది. దీని వల్ల సంవత్సరానికి రు.18341 కోట్లు అదాఅయ్యాయి.
స్టార్టప్ లకోసం ప్రత్యేకంగా ఒక టెలివిజన్ ప్రోగ్రాం ప్రారంభిస్తాం.
విదేశాలలో యువకులు ఉద్యోగాలు సంపాదించుకునేలా స్కిల్ పెంచేందుకు కృషి జరుగుతుంది. ఇందులో విదేశీ భాషలను కూడా నేర్పించేందుకు వీలుంటుంది.
విదేశాలలో యువకులు ఉద్యోగాలు సంపాదించుకునేలా స్కిల్ పెంచేందుకు కృషి జరుగుతుంది. ఇందులో విదేశీ భాషలను కూడా నేర్పించేందుకు వీలుంటుంది.
విదేశాలలో యువకులు ఉద్యోగాలు సంపాదించుకునేలా స్కిల్ పెంచేందుకు కృషి జరుగుతుంది. ఇందులో విదేశీ భాషలను కూడా నేర్పించేందుకు వీలుంటుంది.
గాంధీపీడియా తయారవుతూ ఉంది. యువకులకు గాంధీయన్ విలువలను పరిచయం చేయడం ఈ ప్రాజక్టు ఉద్దేశం
నీటిభద్రత కోసం జన్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. నీటి వనరుల, తాగునీరు, శానిటేషన్ శాఖ లను కలపి ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి గ్రామీణ ఇంటికి జల్ జీవన్ మిషన్ కింద నీటి కొరత తీర్చేందుకు కృషి జరగుతుంది. స్థానికంగా నీటిని పొదుపు చేసి నీళ్ల కొరత తీర్చడం ఈ శాఖ బాధ్యత.
గత రెండేళ్లలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి. ఇది కొనసాగాలి. ఇదే విధంగా నూనెగింజల ఉత్పత్తిలో సాధిస్తాం.
గ్రామ్ సడక్ యోజన్ కింద గ్రీన్ టెక్నాలజీ ద్వారా 30 వేల కి.మీ దూరం రోడ్లు వేశారు. వచ్చే 5 సం. రాలలో రు. 80250 కోట్ల ఖర్చుతో 1.25 లక్షల మైళ్ల రోడ్లను వృద్ధిచేస్తారు.
మత్స్యకారులకోసం ప్రధానమంతి మత్స్య సంపద ప్రోగ్రాం ప్రారంభిస్తాం
మహాత్ముడి 150 వ జయంతి నాాటికి 7 కోట్ల ఎల్ పిజి కనెక్షన్లు ఇచ్చారు.
2022నాటికి 75 వ భారత స్వాతంత్య్ర దినం సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి విద్యుత్ ఉంటుంది. క్లీన్ కుకింగ్ వసతి ఉంటుంది. స్వచ్ఛందగా తిరస్కరిస్తే తప్ప ప్రతిఇంటికి ఈవసతి కల్పిస్తాం.
బ్యాంక్ అకౌంట్ల నుంచి ఏడాదికి 1 కోటి కంటే ఎక్కువ డ్రాచేస్తే2 శాతం టిడిఎస్ కట్టాల్సి ఉంటుంది.
స్పేష్ రీసెర్చ్ లో సాధించిన ప్రగతినుంచి వాణిజ్య పరంగా వినియోగించుకుని రాబడిపెంచుకునేందుకు కొత్త కార్పొరేషన్ ఏర్పాటు.
మీడియాలోకి విదేశీ పెట్టుబడులును అనుమతించే విషయం ఆలోచిస్తున్నాం.ఈరంగంతో చర్చించి దీనిమీద నిర్ణయం తీసుకుంటాం.(ఇదొక సంచలన నిర్ణయం. ఈ ప్రతిపాదన చాలా కాలంగా ఉన్నామీడియా వ్యతిరేకిస్తూ ఉంది)
దేశీ పెట్టుబడులు భారత్ లోకి బాగా వస్తున్నాయి.2018-19 లో బలంగా ఉన్నాయి. 54 బిలియన్ డాలర్లున్నాయి.ఇది అంతకు ముందు ఏడాది కంటే 6శాతం ఎక్కువ
సోషల్ స్టాక్ ఎక్చేంజ్ మొదలవుతుంది. సెబీ కంట్రోల్ లోనే ఇదిపని చేస్తుంది. సోషల్ ఎంటర్ ప్రైజేస్ కోసం ఇది పనిచేస్తుంది.
ప్రధాన్ మంత్రి కర్మయోగి మాన్ ధన్ స్కీం… రిటైల్ రంగంలో పెన్షన్ కోసం ప్రవేశపెడతారు.
ప్రధాన్ మంత్రి కర్మయోగి మాన్ ధన్ స్కీం… రిటైల్ రంగంలో పెన్షన్ కోసం ప్రవేశపెడతారు.
త్వరలో దేశమంతా విద్యత్తును అందుబాటులోకి తెచ్చేందుకు ‘వన నేషన్- వన్ గ్రిడ్ ’ తీసుకువస్తున్నాం. వన్ నేషన్ వన్ కార్డు కొనసాగింపు ఇది