యాదాద్రిలో ప్రియురాలిని చంపి పూడ్చిన ప్రియుడు

ఆ యువతి పేరు భార్గవి. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలం బిజిలాపురం గ్రామానికి చెందిన అమ్మాయి. నరేష్ అనే యువకుడు ప్రేమించినట్లు నటించాడు. తీరా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని ప్రతిపాదన పెట్టగానే దారుణంగా చంపేశాడు. చంపి భార్గవి మృతదేహాన్ని వ్యవసాయ బావి వద్ద మొరం గడ్డలో లోతు గుంత తీసి పూడ్చేశాడు. బార్గవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరేష్ ను విచారించారు. అప్పుడు బార్గవి మృతదేహాన్ని బావి గడ్డ నుంచి బయటకు తీశారు. భార్గవి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బార్గవి డెడ్ బాడీని బయటకు తీసే వీడియో చూడండి. ఈ హత్య తాలూకు పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *