ఫ్లాష్ న్యూస్ : పల్సర్ బైక్ లో మంటలు

హైదరాబాద్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బైక్ లో మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగింది.

సో్మవారం మధ్యాహ్నం హిమాయత్ నగర్ లో పల్సర్ బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. దీంతో వాహనదారుడు అలర్ట్ అయ్యాడు. వెంటనే బైక్ ను రోడ్డు పై వదిలేసి పక్కకు తప్పుకున్నాడు. వాహనదారుడు అలర్ట్ గా ఉండడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

దీంతో మంటలు ఎక్కువై పల్సర్ బైక్ మొత్తం కాలిపోయింది. దీనికి కారణాలేంటా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ ఘటన హైదరాబాద్ లో చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *