‘క్రేజీ అంకుల్స్‌’ మధ్య నలిగిపోతున్న శ్రీముఖి

కొన్ని టైటిల్స్ చూడగానే ఆసక్తి పుట్టిస్తాయి. స్క్రిప్టు సరిగ్గా ఉంటే ఆడేస్తాయి కూడా. అందులో శ్రీముఖి వంటి ముద్దుగుమ్మ ప్రాజెక్టులో ఉంటే మరీను. తాజాగా శ్రీముఖి ప్రధాన పాత్రలో ‘క్రేజీ అంకుల్స్‌’.. టైటిల్‌తో  ఓ చిత్రం రూపుదిద్దుకుంది.  భరణి, మనో, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ.సత్తిబాబు దర్శకుడు. గుడ్‌ ఫ్రెండ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది.  ప్ర‌ముఖ సింగ‌ర్‌ మనో, ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు.
శ్రీముఖి మాట్లాడుతూ…” టీవీలో ఎక్కువగా షోస్ చేస్తున్న నేను క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఒక పాట మిన‌హా దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఆ పాట షూటింగ్ జ‌రుప‌బోతున్నాం. గుడ్ సినిమా గ్రూప్ లో ఇదొక మంచి మూవీగా నిలుస్తుంద‌ని భావిస్తున్నాను” అని తెలిపింది నటి శ్రీముఖి.
మ‌నో మాట్లాడుతూ .. ”క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్‌లో నటించాను. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో మంచి యూనిట్‌తో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. షూటింగ్ సరదాగా జరిగింది. ఫ్యామిలీ అందరూ హాయిగా నవ్వుతూ చూసే సినిమా ఇది. రాజారవీంద్ర‌, శ్రీముఖి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. శ్రీవాస్ గారు భవిషత్తులో ఇలాంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ అంకుల్స్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..”ఈ సినిమాలో నేను యోగా టీచర్‌గా కనిపించబోతున్నాను. కరోనా సమయంలో వర్క్స్ లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు గుడ్ సినిమా గ్రూప్స్ వారు వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి క‌ల్పించ‌డం నిజంగా అభినందించాల్సిన విష‌యం. భవిష్య‌త్తులో గుడ్ సినిమాస్ గ్రూప్ సంస్థ నుండి మ‌రిన్ని మంచి సినిమాలు రావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ త‌ప్ప‌కుండా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *