పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ లో హీరోయిన్ గా సాయి పల్లవి లేనట్టేనా? తాజా అప్డేట్ ప్రకారం ఇది నిజం. సాగర్ చంద్ర దర్శకత్వంలో శర వేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో హీరోయిన్ గా నిత్యా మీనన్ ఎంటరైంది.
””అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ నిర్మాతలు కొంత కాలంగా సాయి పల్లవి కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. చివరికి ఆశలు వాదులుకున్నారు. ఆమె ఆమె పవన్ రానాల మల్టీ స్టారర్ ని ఎందుకని అంగీకరించలేదో తెలియదు. డేట్స్ సమస్య కావచ్చని కొందరంటున్నారు. ఇప్పుడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆమె స్థానంలో నిత్యా మీనన్ ని తీసుకున్నారు. త్వరలో కొత్త షెడ్యూల్లో నిత్యా మీనన్ పాల్గొంటుందని చెబుతున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ రీమేక్లో ఐశ్వర్యా రాజేష్ రానా దగ్గుబాటి హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా, నిత్యా మీనన్ శ్రియతో కలిసి నటించిన ‘గమనం’ ఈ నెలలోనే విడుదలవుతోంది. ఇటీవల నితిన్ తో రంగ్ దే’ నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ రీమేక్ లో ఇంకా సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెళ్ళ .