క్లాత్ స్టోర్ ప్రారంభించిన సినీ నటి (వీడియో)

కొంపల్లి లో సాయి శరణ్య క్లాత్ స్టోర్ ని ప్రారంభించారు సినినటి సురభి. హైదరాబాద్, సాయి శరణ్య క్లాత్ స్టోర్ రెండవ బ్రాంచ్ ని ప్రముఖ సిని నటి సురభి(జెంటిల్మెన్ మరియు బీరువా సినిమాల నటి) కొంపల్లి లో ప్రారంభించారు. పేట్ బషీరాబాద్ లోని ఈ క్లాత్ స్టోర్ లో మహిళలకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయి.
పట్టు, డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మిక్స్ అండ్ మ్యాచ్ మరియు రెడీ మైడ్స్ వంటి ఇంకా ఎన్నో వెరైటీ లు ఈ స్టోర్ లో లభిస్తాయి.
స్టోర్ ప్రారంభం సందర్భంగా సిని నటి సురభి మాట్లాడుతూ సాయి శరణ్య క్లాత్ స్టోర్ గత మూడు సంవత్సరాల నుండి మహిళలకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు అందిస్తుందన్నారు. ఈ రెండవ స్టోర్ ద్వార మరింత మంది కస్టమర్స్ కు మరింత చేరువ కానున్నదన్నారు.
స్టోర్ ప్రారంభం సందర్భంగా ఓనర్ రమా దేవి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలు గా ఈ ప్రాంతం లోని మహిళలకు సంబంధించిన అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ వారి నమ్మకాని గెలుచు కున్న బ్రాండ్ గా మా సాయి శరణ్య క్లాత్ స్టోర్ పేరు పొందినది అన్నారు. తమ ఈ రెండవ స్టోర్ ద్వార ఇంకా ఎంతో మంది కస్టమర్స్ కు తమ సేవలను అందిచాలని చూస్తున్నామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా 25% వరకు తగ్గింపు ధరలకు వస్త్రాలను దీపావళి వరకు అందిస్తున్నామని ప్రకటించారు.
వీడియో కింద ఉంది.