బెంగుళూరు లో ‘ఉలవచారు’

జాగ్వర్ హీరో నిఖిల్ కుమారస్వామి,డిప్యూటీ సీఎం జి పరమేశ్వర చేతుల మీదుగా బెంగుళూరులో  పక్కా ఆంధ్రా వంటకాల  “ఉలవచారు’’ రెస్టరాంట్  ప్రారంభమయింది.

నోరూరించే తెలుగు వంటకాలను అందించి యావత్ ప్రపంచ తెలుగు భోజన ప్రియుల మన్ననలు అందుకున్న”ఉలవచారు రెస్టరాంట్  తాజాగా బెంగుళూరు “కోరమంగళ”లో సేవలు అందించాడనికి సన్నద్ధమైనది.

ఉలవచారు రెస్టారెంట్ ప్రారంభోత్స వానికి కన్నడ స్టార్ హీరో నిఖిల్ కుమారస్వామి,డిప్యూటీ సీఎం జి  పరమేశ్వర,ఎక్స్ హోం మినిస్టర్ రాంలింగా రెడ్డి ,TV5 వైస్ చైర్మెన్ సురేంద్రనాధ్ ,హీరోయిన్ సంజన మరియు మహేష్ రాజ్ కొండూరు తదితరులు విచ్చేశారు.

ఈ సందర్భంగా ఉలవచారు ఫౌండర్స్ వినయ్ నరహరి ,విజయ్ రెడ్డి లు మాట్లాడుతూ ఆంధ్ర,తెలంగాణ ,రాయలసీమ ప్రజల మన్ననలు పొందిన మేము తాజాగా బెంగుళూరు లో మా ఉలవచారు ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా ఉలవచారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికి కృతఙతలు తెలియజేస్తున్నామని అన్నారు.

‘‘బెంగుళూరులోని తెలుగు,కన్నడ భోజన ప్రియులను సంతోష పెట్టాలనే లక్ష్యంతో  మేము ఈ ఉలవచారు ను “కోరమంగళ”లో ప్రారంభించడం జరిగింది.ఉలవచారు బిర్యానీ ,రాజుగారి కోడి పలావ్,కోనసీమ కోడి వేపుడు,గుత్తివంకాయ్ పలావ్,గద్వాల్ పలావ్,పచ్చిమిర్చి కోడి పలావ్,గోదావరి రొయ్యల వేపుడు వంటి మరెన్నో సొంత రెసిపీ లతో జనాదరణ పొందినమేము తాజాగా బెంగుళూరులో మా రెస్టారెంట్ ద్వారా సేవలు అందించదించబోతున్నాము.నేషనల్,ఇంటర్నేషనల్ ఫుడ్ షోస్ లో అనేక అవార్డులు పొందిన మేము కన్నడ ప్రజల అశీసులుపొందుతామని ఆశిస్తున్నాము”అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *