మహిళను కాలుతో తన్నిన టిఆర్ఎస్ ఎంపీపీ (వీడియో)

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో దారుణం జరిగింది. స్థలం విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

అందరూ చూస్తుండగానే ఎంపీపీ ఇమ్మడి గోపీ ఓ మహిళను కాలితో తన్నాడు. వివాదం నేపథ్యంలో ఆ మహిళ చెప్పుతో ఎంపీపీ మీద దాడి చేసింది. దీనితో రెచ్చిపోయిన ఎంపీపీ మహిళ ను తన్నిండు. ఆమె కింద పడిపోయింది. తర్వాత ఎంపీపీ ని పక్కనే ఉన్న మనిషి నూకేయడంతో ఎంపీపీ కూడా కింద పడిపోయాడు.

స్థలం రిజిస్ట్రేషన్‌ తర్వాత ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన గౌరారం వాసి రాజవ్వ చెబుతున్నారు. దీంతో ఆమె తమ బంధువులతో ఎంపీపీ ఇంటి ముందు నిరసనకు దిగింది. ఎంపీపీతో వారు వాగ్వాదానికి దిగారు.

ఈక్రమంలో రాజవ్వ ఎంపీపీని చెప్పుతో కొట్టింది. దీంతో ఎంపీపీ మహిళను కాలితో తన్నాడు. అనంతరం బాధితురాలి బంధువులు ఎంపీపీని అక్కడి నుంచి తోసివేశారు. మహిళను ఎంపీపీ కాలితో తన్నిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో కింద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *