తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో డౌట్లు ఉంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎ.సి.గార్డ్స్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో తమ తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మరియు పిర్యాదు నమోదు చేయడానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్/కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగినదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు.

ఈ సెల్ ఆఫీసు సమయాలతో పాటు అదనంగా రాత్రి 9 గం. నుండి ఉదయం 9 గం. వరకు కూడా పిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. పిర్యాదులకై 040-29802895 అనే నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు.

పిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులకు తగు చర్య నిమిత్తము తెలియజేయబడుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *