నిజామాబాద్ లో తల్లి, కొడుకు మృతి.. టెన్షన్ (వీడియో)

నిజామాబాద్ జిల్లాలో తల్లి, రెండేళ్ల కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ మరణాలు జిల్లాలో కలకలం రేపాయి. తన రెండేళ్ల కొడుకుకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలోని దర్పల్లి మండలం పల్లె చెరువు తండా లో ఈ సంఘటన జరిగింది.

అయితే ఆమె అత్త, తోటి కోడలు కలిసి హత్య చేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అత్త తోటి కోడలి పై దాడి చేసి చితక బాదారు. ఆగ్రహంతో అత్త నివసించే ఇంటికి నిప్పంటించారు. దీంతో తండా లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *