తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు

తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదనంతరం ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. వారితో పాటు కొండా మురళి కూడా తన పదవికి రాజీనామా చేశారు. కొండా టీఆరెస్ నుండి కాంగ్రెస్ లో చేరారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి, పట్నం నరేందర్ రెడ్డి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీరు ముగ్గురు స్థానిక సంస్థల కోటలోనే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

మే 7న నోటిఫికేషన్
మే 31 న పోలింగ్
జూన్ 3న కౌంటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *