టిడిపి రాజ్యసభ అభ్యర్థులు వీరే

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు ఇద్దరు  అభ్యర్థులను ఖరారు చేసింది.ఈ రోజు ఆ పేర్లను టిడిపి కార్యాలయం విడుదల చేసింది.

కడప జిల్లా నుండి రాజ్యసభ అభ్యర్థి గా కొనసాగుతున్న సి యం రమేష్ ని మళ్ళీ కోనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

మరో రాజ్యసభ సీటుకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కు చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ ను  ఎంపిక చేశారని ఒక ప్రకటనలోపేర్కొన్నారు.

CM Ramesh

.

Kanakamedala

 

 

 

 

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు ఈ ప్రకటన విడుదల గత రెండు రోజుల నుండి మీడియా లో, పార్టీ లోను వర్ల రామయ్య పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే,  ఈ సారి వర్ల రామయ్య కు అవకాశం కల్పించలేకపోతున్నామని  తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలిపింది.

రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట తెలుగుదేశం మూడుస్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నం చేసింది. అయితే, తగినంత బలగం లేకపోవడం, వైసిపి నుంచి వచ్చే వారెవరూ లేకపోవడంతో ఈ ప్రయత్నం విరమించుకుని ఇద్దరికే పరిమితమయిందని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *