ఉయ్యూరు పోరగాళ్లు డిష్యూం.. డిష్యూం (వీడియో)

మద్యం మత్తులో యువకులు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డు మీద వీరంగం సృష్టించిన ఘటన ఉయ్యూరులో జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కెసీపీ షుగర్ ఫ్యాక్టరీ వద్ద గల ఓ హోటల్ లో  శుక్రవారం రాత్రి కొందరు యువకులు గొడవపడి రోడ్డు పైనే పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరి పై ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ వీరంగం సృష్టించారు.

నడి రోడ్డు పై దాడులు చేసుకోవడంతో ఏం జరిగిదో ఏమో అన్న భయంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. హోటల్ కు వచ్చిన జనం సైతం భయంతో పరుగులు తీశారు.. ఇంత గొడవ జరుగుతున్నా పెట్రోలింగ్ పోలీసులు అటు వైపుగా కన్నెత్తి కూడా  చూడలేదు. నడిరోడ్డు లో గొడవ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇటువంటివి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *