బ్రేకింగ్ న్యూస్.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి సిఎం కేసిఆర్ మీద, కేసిఆర్ ఫ్యామిలీ మీద విమర్శల వర్షం కురిపించారు. మోడీ కనుసన్నల్లోనే ఓటుకు నోటు కేసుపై సమీక్ష చేశారని ధ్వజమెత్తారు. ఇదంతా ఆన్ రికార్డు మాట్లాడారు రేవంత్. కానీ ఆఫ్ ది రికార్డు గా తీవ్రమైన కామెంట్స్ చేశారు. మీడియా చిట్ చాట్ లో రేవంత్ సంచలన కామెంట్స్ మీరే కింద చదవండి.

నాకు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ పదవి వద్దు.

ఈ విషయంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తా.

నన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు చాలా హామీలిచ్చారు.

రాష్ట్ర కాంగ్రెస్ టీం లీడర్ కు సలహాలిచ్చేవారు సరిగాలేరు. (ఉత్తమ్ ను ఉద్దేశించి)

నా పనితీరు తెలిసి కూడా టీం లీడర్ నన్ను సరిగా వాడుకోవడంలేదు (ఉత్తమ్ ను ఉద్దేశించి).

నా హోదాకు తగిన పదవి ఇస్తేనే తీసుకుంటా. లేదంటే తీసుకోను.

అవసరమైతే సామాన్య కార్యకర్తగానైనా పనిచేస్తాను.

నాకు వయసు, ఓపిక ఉన్నాయి. నా లక్ష్యం సిఎం పదవే.

ఇవాళ కాకపోయినా కొంతకాలం తర్వాతైనా సిఎం అవుతాను.

నా హోదాకు తగ్గ పదవి ఇస్తేనే తీసుకుంటాను..

నా పనితనాన్ని వాడుకుంటే కాంగ్రెస్ కు సొమ్మవుతుంది.

నన్ను సరిగా వాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం.

నేను సలహా ఇచ్చిన తర్వాతే కోమటిరెడ్డి, సంపత్ కుమార్ దీక్షలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *