గంటా విషయంలో సాక్షికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన లోకేష్

ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్ ఒక కధనాన్ని ప్రసారం చేసింది. దీని సారాంశం అధికార పార్టీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు హైకమాండ్ పై అలక పూనారు అని. ఈ విషయంపై ఆగ్రహించిన నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో సాక్షికి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

గంటా అలకబూనారంటూ చేసిన సాక్షి టీవీ ప్రసారం లోకేష్ నోటిస్ కి రావడంతో… ఆయన గంటా శ్రీనివాసరావుతో ఈ విషయంపై చర్చించారు. దుష్ప్రచారం అని తేలడంతో నారా లోకేష్ సాక్షి టీవీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. గంటాతో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. అది ఇప్పటి పిక్ అని స్పష్టంగా తెలిసేలా వారిద్దరి వెనుక టీవిలో సాక్షి కధనం ప్లే చేసి ఆ సెల్ఫీ తీసుకున్నారు.

అవును నిజమే! గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి. అవినీతి డబ్బా…అవినీతి పత్రిక అంటూ వారు తీసుకున్న ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటో కింద ఉంది చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *