భూమా ఫ్యామిలీకి షాక్: వైసీపీలోకి అఖిలప్రియ మేనమామ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. శనివారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భూమా ఫ్యామిలీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలింది.

భూమా అఖిలప్రియ మేనమామ ఎస్ వి జగన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. మరోవైపు జనసేన తరపున విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ అలియాస్ శ్రీనుబాబు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరితోపాటు మరికొందరు కీలక నేతలు వైసీపీలో జాయిన్ అయ్యారు.

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి గూడూరు నియోజకవర్గం బల్లి దుర్గా ప్రసాద్, మాజీ ఎంపీ వంగా గీత, తాడి శకుంతల విజయవాడ మాజీ మేయర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాంచంద్రారెడ్డి, విశాఖ జిల్లా మాజీ మేయర్ ద్రోణం రాజు శ్రీనివాస్ తదితరులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఆయన సూచనతో లోక్ సభ అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించిన జగన్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *