టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై…త్వరలో వైసీపీలోకి?

టీడీపీకి మరో షాక్ తగలనుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే త్వరలో పార్టీ వీడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో అసంతృప్తితో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ జాబితాలో మరో ఎమ్మెల్యే కూడా చేరనున్నట్టు సమాచారం. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు పార్టీ వీడనున్నారు? ఏ పార్టీలో చేరనున్నారు? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.

ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పార్టీ వీడనున్నట్టు సంకేతాలొస్తున్నాయి. ఈ విషయమై ఆయన పందిళ్లపల్లిలో కార్యకర్తలతో సమావేశమై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. పార్టీలో ఉన్న అసంతృప్తి కారణంగానే ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని చీరాలలో టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అనంతరం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

కాగా ఆమంచితో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి ఆయన్ని ఆహ్వానించినట్టు సమాచారం. బుధవారం ఆయన పార్టీ అధినేత జగన్ తో భేటీ అవుతారని అంటున్నారు ఆయన అనుచరులు. ఈ మేరకు ఇప్పటికే అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్టు ముఖ్య వర్గాల సమాచారం. జగన్ తో భేటీ అనంతరం ఆయన పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *