కర్నూలు రోడ్డు ప్రమాదం, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్‌పోస్టు జాతీయ రహదారి 44 మీద ఈ సాయంకాలం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తుఫాన్‌ వాహనంతో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇదెలా జరిగిందనేదాని మీద ఇంకా అధికారిక ప్రకటన వెలవడలేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *